బయోలజికల్
సదస్సు పత్రాన్ని ఆవిష్కరిస్తున్న బయోలాజిక్స్ క్రిష్ణ ప్రసాద్, రంజిత్
సేన్, కైసర్ జామిల్, శ్రీను బాబు, బుక్కపట్నం మురళి తదితరులు...
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్... ఒమిక్స్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బయోటెక్ గురించి వివరిస్తూ అక్టోబర్ 27,29న జరగబోయే అంతర్జాతీయ సదస్సు హెచ్ఐసిసిలో జరుగుతుందని ఒమిక్స్ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. డ్రగ్స్ కు సంబంధించి అతి ముఖ్య మైన సమస్యలపై చర్చించారు. మంగళవారం బంజారాహిల్స్ లోని హోటల్ ఎన్ కె ఎం గ్రాండ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతినిధులు క్రిష్ణ ప్రసాద్, రంజిత్ సేన్, కైసర్ జామిల్, శ్రీను బాబు, బుక్కపట్నం మురళి కలిసి మాట్లాడారు. ఈ సదస్సులో అంతర్జాతీయ ప్రాంతాల నుంచి 300 మంది పాల్గొంటారన్నారు. ఈ సదస్సులో పాల్గొనేవారిలో ఫార్మా, బయోటెల్, సీఎంఓలు, రీ సెర్చ్ ఇనిస్టిట్యూషన్లు, ఇన్వెష్టర్లు, పరిశ్రమ వాటాదారులు ఉంటారని డాక్టర్ శ్రీను బాబు గెడెల తెలిపారు. అక్టోబర్ న జరగబోయే సమావేశానికి వివిధ దేశాల నుంచి ముఖ్య ప్రముఖులు, వివిధ కంపెనీలకు చెందిన స్పీకర్లు పాల్గొంటారని తెలిపారు.

No comments:
Post a Comment