తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; నగరానికి వచ్చిన భజాపా జాతీయ అధ్యక్షుడు అమీత్ షాను తెలంగాణ బీజేపీ నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా అమీత్ షా పార్టీని ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్ల తెలిపారు. ఇప్పుడు గుజరాత్ నుండి ఫ్రదాని అయిన నరేంద్రమోదీ హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చి దిద్దడానికి అన్ని రకాల సహాయపడతారని అమిత్ షా హామీ ఇచ్చారు. బీజేపీ నాయకులలో నూతనోత్సాహం నింపారు. అమీత్ షాను పలువురు బీజేపీ నాయకులు అమీర్ పేట హరిత ప్లాజా హోటల్ ఘన స్వాగతం పలికారు. సమావేశంలో కిషన్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్


No comments:
Post a Comment