All meadia

 

Monday, 28 September 2015

Minister KTR PRESS conference



Sent from
తేది-28-09-2015
పత్రికా ప్రకటన
ఈ-పంచాయితీలతో సమగ్ర గ్రామాభివృద్ది, మహిళా సాధికారత సాకారం- పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు
 గ్రామస్ధాయి పెట్టుబడిదారులు (VLE'S) ల శిక్షణ కార్యక్రమంలో మంత్రి కె.తారక రామారావు మహిళలతో సంభాషణ
 గ్రామాల్లోకి అన్ని పౌరసేవలను ప్రజలకి తీసుకువెళ్లేందుకే ఈ కార్యక్రమం
 పల్లె సమగ్ర సేవా కేంద్రాల ద్వార సూమారు 10,000 మందికి మహిళకి ఉపాది
 సమాచార, సాంకేతిక పరిజ్ఘానాన్ని మేళవింపుతో శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం గోప్పమార్పుకి నాంది

గ్రామాల్లో ప్రారంభించనున్న సమగ్ర పల్లె సేవ కేంద్రాలను గ్రామాల సంపూర్ణ ఆభివృద్ది మహిళా సాధికారత లక్ష్యంగా ప్రారంభిస్తున్నట్లు పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. మహిళలకి సాధికారత కల్పించేందు కోసమే ఈ సమగ్ర సేవ కేంద్రాల నిర్వహాణను మహిళలకే కట్టపెట్టామన్నారు. మహిళలు ఏ కార్యక్రమం చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారన్న నమ్మకం తమదన్న మంత్రి...ఈ మహిళలు నిర్వహించబోయే ఈ పల్లె సమగ్ర సేవా కేంద్రాలు విజయవంతంగా నడుస్తాయన్నారు. తెలంగాణ పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది సంస్ధ, రాజేంద్రనగర్ లో పల్లె సమగ్ర సేవా కేంద్రాలను నిర్వహించేందుకు ఏంపిక చేసిన గ్రామస్ధాయి పెట్టుబడిదారులు ( VLE'S) ల శిక్షణ కార్యక్రమంలో మంత్రి కె.తారక రామారావు మహిళలతో సంభాషించారు. గ్రామాల్లోకి అన్ని పౌరసేవలను ప్రజలకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమం ఉపయోగయోగపడుతుందన్నారు. నాలుగు లక్షల పైచిలుకు స్వయం సహయక సంఘాలల్లోని మహిళలు సూమూరు 5వేల కోట్ల రూపాయాల రుణాలను తిరిగి చెల్లిస్తూ అర్ధిక క్రమశిక్షణకి మారుపేరుగా నిలుస్తున్నారని ప్రశంసిచారు. పల్లె సమగ్ర సేవా కేంద్రాల నిర్వహణ ద్వార సూమారు 10,000 మహిళకి మందికి ఉపాది లభిస్తుందన్నారు. మహిళలు ఈ కేంద్రాల నిర్వహణ ద్వారా గౌరవ ప్రదమైన స్ధానం లభిస్తుందన్న అశాభావం వ్యక్తం చేశారు. ఈ కేంద్రాలను నిర్వహించే మహిళలు...తమకున్న నైపుణ్యాలను ఉపయోగించుకుని మరిన్ని అదాయ వనరులు పెంచుకోవాలన్నదే తమ అభిమతమన్న మంత్రి...అందుకోసమే వీరిని గ్రామస్ధాయి పెట్టుబడిదారులంటున్నమన్నారు.
ఈ కార్యక్రమం పూర్తి స్ధాయిలో నిర్వహణలోకి వచ్చిన తర్వతా ఈ పంచాయితీ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఓక అదర్శంగా నిలుస్తుందన్నారు... సాంకేతికతను ప్రభుత్వ పాలన విధానాలతో అనుసంధాంన చేసినప్పుడు అవినీతి తగ్గుతుందని...ప్రజలకి ప్రతిఫలాలు వందశాతం అందుతాయన్న మంత్రి....ఈ పంచాయితీల ఏర్పాటుతో ప్రభుత్వ పాలనా లక్ష్యాలు సంపూర్ణంగా నెరవేరుతాయని మంత్రి తెలిపారు.... సమాచారాన్ని సాంకేతిక పరిజ్ఘానాన్ని కలిపి తాము శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం గోప్పమార్పు తీసుకువస్తుందని...ఇందులో భాగస్వాములవుతున్న పత్రి వియల్ ఈ VLE లను అభినందించారు. ఈ పల్లె సమగ్ర సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వా పథకాల నగదు పంపీణీని అనుసంధానం చేస్తామన్నారు. ముఖ్యంగా ఉపాధి హమీ పథకం చెల్లింపులు, పించన్ల చెల్లింపులు ఈ కేంద్రాలకి అనుసంధానం చేస్తామన్నారు.

ఈ సమగ్ర సేవా కేంద్రాల నిర్వహణకి ఏంపిన చేసిన మహిళలతో మంత్రి సంభాషించారు. ఏ ఏ అంశాల మీద శిక్షణ ఇచ్చారు.... మెత్తం ఈ పల్లె సమగ్ర సేవ కేంద్రాల ఏర్పాటు పట్ల గ్రామాల్లో ఏలాంటి స్పందన ఉంది....మెత్తం కార్యక్రమ నిర్వహణ ద్వార ఏలాంటి ప్రయోజనాలుంటాయంటూ వారి పలు అంశాల మీద అడిగి తెలుసుకున్నారు. నల్గోండ జిల్లాకి చెందిన నజిమా... తనకి లభించిన ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని తెలిపిన... ప్రస్తుతం బ్యాంకు బిజినెస్ కరెస్పాండెట్ గా సూమారు 4వేల రూపాయాలు నెలకి సంపాదిస్తున్ననని తెలిపింది. ప్రభుత్వ పధకాల నగదు చెల్లింపులను అనుసంధానం చేసిన తర్వతా అదాయం మరింత పెరుగుతుందన్నారు.
కరీంనగర్ జిల్లాకి చెందిన రజిత మంత్రికి ప్రస్తుతం తాము అందిస్తున్నసేవలను మంత్రికి వివరించారు. తాను సూమారు నెలకి పదివేలు అదాయం పొందుతున్నట్లు....చాల మంది వృద్దపించన్ లబ్దిదారులు...తాను అందిస్తున్న సేవలను అభినందిస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో పంచాయితీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్, కమీషనర్ అనితా రాంచంద్రన్, ఐటి శాఖ సెక్రటరీ జయేష్ రంజన్, స్ర్తీనిధి యండి విద్యాసాగర్ రెడ్డి, ఇతర ఉన్నాతాదికారులున్నారు.

No comments:

Post a Comment