Wednesday, 30 September 2015
దేశంలో వినాయక పూజకు 22వేల కోట్లు.. వృధా...??? అంటూ
Tv9 వాళ్ళు మన కళ్ళు తెరిపించారు
ఇంతకు ఆ 22వేల కోట్లు వృధా ఏ విధముగా జరిగిందో ఎవ్వడైనా చెప్పాగలడా....???
22వేల కోట్లు వినాయక పూజకు కాకుంట పేద ప్రజలకు పెట్టి ఉంటే బాగుండేది.....
ఇంతవరకు బాగానే ఉంది.
ఇంతకు 22వేల కోట్లు వృధా అంటున్నారు కదా ఆ డబ్బు అంత వినాయకుడు తిన్నాడా ...???
లేక కాల్చి బూడిద చేసారా..??
వృధా జరిగింది అని మీరు ఎలా భావిస్తున్నారు ...??
చెప్పగలరా ...??
నా ఆలోచన కి వృధా అన్నది ఒక్క పైసా కూడా జరగలేదు
చివరకు వినాయకుని ఉపయోగించిన మట్టిని కూడా మనం తిరిగి ఉపయోగించ గలుగుతున్నాము
పేద ప్రజల మీద అంత ప్రేమ చూపిస్తున్న వాళ్ళకు ఒక ప్రశ్న....
ఇంతకు ..పేద ప్రజలు అంటే ఎవ్వరు ...???
న్యాయంగా మట్టితో వినాయకుడి విగ్రహాల్ని తయ్యారు చేస్తూ ఆ విగ్రహాలకు అమ్ముకుంటున్న వాళ్ళు పేద ప్రజలు కారా ...??
ఉదయం 3 గంటలకే నిద్రలేచి పూలదండలు కడుతూ
ఆ హారాల్ని అమ్ముకొని న్యాయంగా కడుపు నింపు కుంటున్న ప్రజలు పేదవారు కాదా ..???
రాష్ట్రం కాని రాష్ట్రాలకు వెళ్తున్న పశ్చిమ బెంగాల్ మరియు ఇతర రాష్ట్రాల ప్రజలు, మండపాలు కడుతూ వాళ్ళ భార్య , బిడ్డలకు ధర్మంగా కడుపు నింపు కుంటున్నరు కదా.... వారంతా పేద ప్రజలు కాదా ...???
విగ్రహాలకు రంగులు పూస్తున్న...
ఆ రంగుని తయారు చేస్తున్న ప్రజలు పేద ప్రజలు కాదా ..???
విద్యుత్ పరికరాలతో మండపాన్ని రంగుల హరివిల్లుగా తీర్చి దిద్దే వాళ్ళు పేద ప్రజలు కాదా...???
ప్రతి పూజా మండపాలలో చేస్తున్న అన్నదానంలో .. కుల మతాలకు అతీతంగా భోజనం చేస్తున్న ప్రజలు పేద ప్రజలు కాదా .???
ఇంతకు మీరంతా చింతిస్తున్న పేద ప్రజలు ఎవ్వరు..???
ఒక్క సారి విగ్రహాలు తయారు చేస్తున్న వాళ్ళను అడగండి.... వాళ్ళు చెప్తారు వాళ్ళకు దేవుడు ప్రత్యక్షంగా కాకపోయినా.... పరోక్షంగా వాళ్ళకు ఈ రకముగా దీవెనలు అందిస్తున్నాడు అని ఆనందంగా చెప్తారు ...
పాపం వాళ్ళకు రెక్కాడితే కాని డొక్కాడదు..
ఇక్కడే ఇంకో ప్రశ్నకు ఆస్కారం ఉంది. పూజకు ఖర్చు పెట్టే డబ్బు వాళ్ళందరికీ ఉచ్చితంగా ఇచ్చెయ్యవచ్చు కదా అని ...
ఆలోచించండి, అలా ఉచితంగా తీసుకునే సంస్కారం హిందూ ప్రజలకు లేదు....
ఇంకో మాట వినాయక చవితి పూజలు చేస్తున్న ప్రజలు బాగా బలిసిన వాళ్ళు కాదు...
ఇదిగో మాలాంటి సామాన్య ప్రజలం. అందరం ఒక్కరి నిధుల మీద ఆశ పడకుంట సమిష్టిగా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నం.
మాకు మీలాగా అడ్డగోలుగా నిధులు రావు.అలా వచ్చినా మేము తీసుకోము ..
మాకు మేము కష్టపడి సంపాదించి....
బిరియాని కాకా పోయిన సంతోషంగా గెంజి నీళ్ళు తాగుతం మా కష్టార్జితంతో మాకు తోచిన రీతిలో మా ఆనందం కోసం ప్రాకులాడుతూ పూజలు నిర్వహిస్తున్నం... ఎందుకంటే ఆనందం అన్నది కూరగాయల సంతలో దొరికేది కాదు అది ప్రతి పనిలో భగవంతుని చూడగలుగడం.
ఈ పండుగలో ప్రకృతి సౌందర్యంతో కూడుకున్న నిజమైన ఆనందం దొరకుతుంది.
మా ఆనందం కేవలం మా వరకే కాదు. వినాయక చవితితో లబ్ది పొందుతున్న ప్రతి జీవికి కూడా ఆనందమే ... మేము పేద వారిమే కానీ న్యాయంగా బ్రతికే వాళ్ళం. ఆ దేవాదాయ శాఖకు హిందూ ధర్మ నిధి ప్రతి సంవత్సరం లక్ష కోట్లు నిధి కన్నా ఎక్కువ వస్తుంది.
ఆ డబ్బుతో
మైనారిటీ
దళితులు
ఎస్ సి
ఎస్ టి
బడుగులు
బలహీనులకు, ప్రతి నెల పింఛన్, కోటా బియ్యం, చదువు కోసం నిధులు కేటాయించడం జరుగుతున్నది.
వినాయక చవతి వలన అందరికి మంచే జరిగింది.
ఆ దేవుడి దయవల్ల కొన్ని వేల మంది కడుపు నింపు కున్నారు
విజ్ఞులారా ....
22 వేల కోట్లు వృధా అవ్వలేదు,
ఆ 22 వేల కోట్లు రూపాయలు ఆ గణనాథుడి ద్వారా పేద ప్రజలకు చేరటం జరిగింది.
ఇది నగ్న సత్యం
జై హింద్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment