దాహం వేస్తుందమ్మా
కాసిన్ని మంచినీళ్లిస్తావా..గతంలో ఎవరింటికి వెళ్లినా మంచినీరు అడిగి మరీ
తాగేవారు.అటువంటిది నేడు మంచినీరు తాగాలంటేనే భయపడిపోతున్నారు. రాను రాను
పరిస్థితి ఎంతలా మారిపోయిందంటే..ఆఫీసుకెళ్లినా..బంధువుల
ఇంటికెళ్లినా..లేదంటే మార్కెట్కు వెళ్లినా ఒక మంచినీటి బాటిల్ కూడా
ఉండాల్సిందే. ఎందుకంటే సర్వ రోగాలకు మంచినీరే కారణమని తేల్చేశారు..దీంతో
ప్రతీ ఒక్కరికీ మంచినీటిపై శ్రద్ధ పెరిగిపోయింది. సురక్షిత మంచినీటికి నానా
తంటాలు పడుతున్నారు..దీనిలో భాగంగానే ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల స్రవంతి
వాటర్ పథకాలను ఏర్పాటు చేసింది.ఆ పథకాల ద్వారా అందించే నీరైనా
సురక్షితమేనా అంటే కాస్త ఆలోచించాల్సిందే. అందుకే అవకాశం ఉన్న వాళ్ళు
వాటర్ ఫ్యూరిఫైర్స్ కొనుగోలు చేసుకుని సురక్షిత నీటిని సేవిస్తుంటే..
అవకాశం లేనివాళ్ళు దేవుడే దిక్కంటూ దొరికిన నీటినే సేవించి కాలం
వెళ్లదీస్తున్నారు.అసలు మనం తాగుతున్న నీరు సురక్షితమా కాదా తెలుసుకోవాలంటే
ఎలా..దానికి అవకాశం ఉంది..మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే.మీరు తాగే
మంచినీటిని భీమవరంలో ఇటీవల ఏర్పాటు చేసిన మంచినీటి పరీక్షా కేంద్రానికి
తీసుకెళితే చాలు వాళ్ళు పరీక్షించి ఇస్తారు.మీ నీరు సురక్షితమా కాదా అనేది
తేల్చేస్తారు..అప్పుడు మీ నీరు ముంచేదా..లేల్చేదా తేలిపోతుంది..ప్రతీ
ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధులు ఈ పరీక్షలు చేయిస్తే ప్రజలకు సురక్షిత
నీటిని అందించవచ్చు..రోగాలకు చెక్ చెప్పేయవచ్చు.
No comments:
Post a Comment