All meadia

 

Wednesday, 9 September 2015

మద్యం లేక పలువురికి అస్వస్థత

మద్యం మహమ్మారితో కుటుంబాలు నష్టపోతున్నాయని భైంసా మండలంలోని మూడు గ్రామాల ప్రజలు మద్య నిషే ధం ప్రకటించారు. గ్రామస్థులందరి సమన్వయంతో, యువజన సంఘాల తోడ్పాటుతో మూడు గ్రామ పంచాయతీల వీడీసీలు మద్య నిషేధాన్ని విధించేందుకు తీర్మానించి అమలుపరుస్తున్నారు. మాటేగాం గ్రామ పం చాయతీ పరిధిలో స్వాతంత్య్ర దినోత్సవం నుంచి, కుంసర గ్రామ పరిధిలో రాఖీ పౌ ర్ణమి నుంచి, కామోల్‌ గ్రామంలో శ్రీ కృష్ణుని జయంతి నుంచి మద్య నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
కొంత కాలంగా గ్రామాల్లో మద్యం విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కల్తీ కల్లు విక్రయాలు జోరుగా జరుగుతున్నా యి. దీంతో పగలు, రాత్రి అనే తేడా లేకుం డా మద్యం సేవించి గొడవలు జరుగుతున్నాయి. అంతే కాకుండా అతిగా మద్యం తాగి పలువురు అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ప్రశాంతత కరువైంది. మద్యం మహమ్మారితో ఏర్పడుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ముందుగా మాటేగాం గ్రామస్థులు అడుగువేశారు. అనంతరం ఇదే తరహాలో కుంసర, కామోల్‌ గ్రామస్థులు మద్యంపై సమరం ప్రారంభించారు. ఈ క్రమంలో మూడు గ్రామాల యువజనులు కీలక పాత్ర పోషించాయి. గ్రామంలోని అన్ని వర్గాల వారు సంపూర్ణ మద్దతు తెలుపడంతో మాటేగాం, కుంసర, కామోల్‌ గ్రామాల వీడీసీలు తీర్మానం చేసి మద్య ని షేధాన్ని తమ తమ గ్రామాల్లో విధించారు. ఒకే సారి మద్యం మానివేయడంతో కొంత మంది మందుబాబులు అస్వస్థత చెందుతున్నారు. అయినప్పటికీ వీడీసీలు మొక్కవోని దీక్షతో మద్య నిషేధాన్ని కొనసాగిస్తున్నారు.

No comments:

Post a Comment