All meadia

 

Tuesday, 1 September 2015

రేపు అర్ధరాత్రి నుంచి ఒక రోజు ఆటోల బంద్‌

ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్‌లో కూడా డీజీల్‌తో నడుస్తున్న ఉబెర్‌, ఓలా క్యాబ్స్‌లను వెంటనే నిషేధించాలని, ఆటోలపై నో ఎంట్రీ ఎత్తివేయాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ జేఏసీ కన్వీనర్‌ మహ్మద్‌ అమానుల్లాఖాన్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి నుంచి ఒక రోజు ఆటోలు బంద్‌ చేస్తామని అన్నారు. అలాగే సెప్టెంబర్‌ 2న చార్మినార్‌ వద్ద ఉదయం 11 గంటలకు ఆటోడ్రైవర్ల ఽనిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఆటోడ్రైవర్స్‌ జేఏసీ నాయకులు జె.రవీందర్‌, మిర్జా రఫతుల్లా బేగ్‌, మహ్మద్‌ ఆజీముద్దీన్‌, ఫారుఖ్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. ఆటోలు పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయని, ఆటోలు వెదజల్లే కాలుష్యం వల్ల చార్మినార్‌కే ప్రమాదం ఏర్పడిందని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వితండవాదం చేయడం పట్ల ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు. 

No comments:

Post a Comment