ప్రత్యేక హోదా కోరుతూ ఈ
నెల 15న గుంటూరులో ప్రతిపక్ష నేత జగన్ తలపెట్టిన దీక్ష వినాయక చవితి
కారణంగా ఈ నెల 26కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ నేత జ్యోతుల
నెహ్రూ హైదరాబాద్లో మీడియాకు తెలిపారు. నదుల అనుసంధానానికి వైఎస్ చర్యలు
చేపడితే..చంద్రబాబు నేనే చేశానంటూ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దేవినేని
ఉమ, చింతమనేని పూజలు ఎందుకో చెప్పాలన్నారు. పట్టిసీమకు ఎప్పటికీ వైసీపీ
వ్యతిరేకమేనని జ్యోతుల నెహ్రూ మరోసారి స్పష్టం చేశారు.
No comments:
Post a Comment