షీనాబోరా హత్య కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ హత్యకు ప్రేమ
వ్యవహారమే కారణమని ఇప్పటి వరకు భావించారు. అయితే ఆస్తి తగాదాల వల్లే షీనాను
తల్లి ఇంద్రాణి హత్య చేసిందని పోలీసులు చెబుతున్నారు. ఇంద్రాణి ముఖర్జీకి
డబ్బు పిచ్చి ఉందని తేలింది. ఇంద్రాణి రహస్య బ్యాంకు ఖాతాలు నిర్వహించిందని
తెలుసుకుని భర్త, మీడియా ప్రముఖుడు పీటర్ ముఖర్జీ బిత్తరపోయారు. షీనాబోరా
హత్య బయటపడ్డాక ఇంద్రాణి దూరంగా ఉండాలని పీటర్ భావిస్తున్నారు.
No comments:
Post a Comment