హైదరాబాద్ నగరంలో రోడ్ల
పరిస్థితి నరకంగా మారిందని ఎమ్మెల్యే కిషన్రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్ను విశ్వనగరంగా చేస్తానంటున్న కేసీఆర్ దుర్భర నగరంగా
మారుస్తున్నారని ఆయన విమర్శించారు. గ్రేటర్ పరిధిలో ఒక్క గుంత చూపిస్తే
వెయ్యి రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని... కాని ఒక్క రోడ్డు
బాగున్నట్లు చూపిస్తే తాను రూ.లక్ష ఇస్తామని కిషన్రెడ్డి ప్రకటించారు.
గతంలో నెంబర్వన్ సిటీగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు దేశంలో 272 స్థానానికి
వచ్చిందని కిషన్రెడ్డి ఆరోపించారు.
No comments:
Post a Comment