కేంద్ర ప్రభుత్వం
ప్రతిపాదించిన జాతీయ రహదారి భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం దేశ
వ్యాప్త బంద్కు ఆటో యూనియన్లు పిలుపునిచ్చాయి. గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ
బస్సులతోపాటు ఆటోలు, క్యాబ్లు, ప్రైవేటు బస్సులు, లారీలు
నిలిచిపోనున్నాయి. ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు బంద్కు
మద్దతుగా విధులకు వెళ్లడం లేదు. గ్రేటర్ పరిధిలో 3500 ఆర్టీసీ బస్సులు,
1.30 లక్షలకు పైగా ఉన్న ఆటో రిక్షాలు నిలిచిపోనున్నాయి. కార్మిక సంఘాలు
ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించే సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ హైదరాబాద్,
సికింద్రాబాద్, రంగారెడ్డి రీజియన్లకు చెందిన బస్సులు దాదాపుగా
నిలిచిపోనున్నాయి. సమ్మెకు ఆర్టీసీ టీఎంయూ, ఎన్ఎంయూ, ఈయూలు ఇప్పటికే
మద్దతు తెలపడంతోపాటు కార్మికులు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చాయి.
బుధవారం తెల్లవారు జామునుంచే సిటీ బస్సులు, జిల్లాలకు వెళ్లాల్సిన బస్సులు
డిపోలకే పరిమితం కానున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లకు
చెందిన సిటీ బస్సులతోపాటు రంగారెడ్డి రీజియన్కు చెందిన సుమారు ఆరువందల
జిల్లా బస్సులు నిలిచిపోతాయని తెలిపారు.
No comments:
Post a Comment