బంగారు తెలంగాణ చేస్తాడని
కేసీఆర్ను గెలిపిస్తే.. తాగుబోతుల తెలంగాణ తెచ్చాడని టీడీపీ ముఖ్యనేత
,కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం ఎల్బీనగర్కు చెందిన
టీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల నేతలు రేవంత్రెడ్డి సమక్షంలో టీడీపీలో
చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్రెడ్డి కేసీఆర్పై నిప్పులు
చెరిగారు. కేసీఆర్ నియంతృత్వ విధానాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం
చేస్తున్నాడని విమర్శించారు. తెలుగు ప్రజలందరూ గర్వంగా చెప్పుకునే మహానగరం
హైదరాబాద్ను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీనేనని ఆయన చెప్పారు.
సింహం సింగిల్గా హైదరాబాద్ వస్తుంటే కేసీఆర్ భయపడి చైనాకు వెళ్లాడని ఆయన
ఎద్దేవాచేశారు. ‘మొదలైంది ఆట కాదని..వేట’ అని రేవంత్ అన్నారు.
No comments:
Post a Comment