ఏపీ
అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష సభ్యురాలు రోజా
మాట్లాడుతూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య
చేసుకున్న రిషితేశ్వరి మృతికి టీడీపీయే కారణమని ఆరోపించారు. టీడీపీ
అధికారంలోకి వచ్చాకే మహిళలపై దాడులు పెరిగాయని రోజా అన్నారు. ఆత్మహత్యకు
కారణమైన ప్రిన్సిపాల్కు టీడీపీ కొమ్ముకాస్తుందని ఆరోపించారు. ఆడపిల్లల
ప్రాణాలంటే తెలుగుదేశం ప్రభుత్వానికి విలువ లేదా అని రోజా ప్రశ్నించారు.
రిషితేశ్వరి ఆత్మహత్యకు కారణమైన వారందరిపై చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్
చేశారు.
No comments:
Post a Comment