All meadia

 

Saturday, 5 September 2015

తెలంగాణలో నియంత పాలన సాగుతోంది :ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

తెలంగాణలో నియంత పాలన సాగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మహబూబ్‌నగర్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై చేయిచేసుకున్న ఘటనతో రౌడీల పాలనకు తెరదీశారన్నారు. అలాగే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, రైతులకు రుణమాఫీ అమలు జరగడం లేదన్నారు. బ్యాంకర్లు వడ్డీలు వసూలు చేస్తూనే ఉన్నారని, వ్యవసాయశాఖా మంత్రి పంచె కట్టినంత మాత్రాన రైతు కాలేరని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.

No comments:

Post a Comment