All meadia

 

Wednesday, 9 September 2015

స్కాలర్‌షిప్‌ దరఖాస్తులకు గడువు 20 వరకు పొడిగింపు

2014-15 సంవత్సరంలో స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు పొందని విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. హైదరాబాద్‌ జిల్లాలోని పలు కళాశాలల్లో చదువుతున్న షెడ్యూల్డు కూలల విద్యార్థులు, వికలాంగ విద్యార్థులు 2014-15 సంవత్సరంలో ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోని వారికి సెప్టెంబర్‌ 20 వరకు గడువు పొడిగిస్తున్నట్లు హైదరాబాద్‌ జిల్లా ఎస్‌సీడీ ఉపసంచాలకులు డి.హన్మంతునాయక్‌ తెలిపారు. 2014-15 సంవత్సరంలో ప్రభుత్వ ఇంటర్‌, డిగ్రీ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు బయోమెట్రిక్‌ అవసరం లేదని, దరఖాస్తులు సంబంధిత జిల్లా సంక్షేమ అధికారికి అందజేయాలని తెలిపారు. అన్ని కళాశాలల్లో ప్రిన్సిపాల్స్‌ విద్యార్థుల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలన్నారు. ఇప్పటికీ పలు కళాశాలల ప్రిన్సిపాల్స్‌ దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారని, అలాంటి వారందరూ వెంటనే సంబంధిత జిల్లా సంక్షేమ శాఖ అధికారులకు ఆన్‌లైన్‌లో పంపించాలని సూచించారు. అలా పంపించని కళాశాలలపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

No comments:

Post a Comment