ఈనెల నవంబర్ 4న పదవ మొహర్రం రోజు బీబీ కా ఆలం ఊరేగింపు కావడంతో సందర్శకుల రద్దీ పెరిగింది. పాతబస్తీలోని బీబీ కా అలావా గత 163 ఏళ్ల నుంచి మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రతి ఏటా మొహర్రం నెలలో బీబీ కా అలావాను దర్శించేందుకు నగరం నుంచే కాకుండా జిల్లాలు, ఇతర రాష్టాల నుంచి పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు తరలి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు.
No comments:
Post a Comment