తెలంగాణ, వెబ్ న్యూస్ హైదరాబాద్; తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డును ఆవిష్కరించింది. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు చట్టం 1971 ని తెలంగాణ ప్రభుత్వం స్వీకరించింది. ఇక నుంచి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా వేరుగా పరీక్షలు నిర్వహించుకోవడానికి మార్గం సుగుమమైంది. ఇంటర్ బోర్డు విభజన ఫైల్ పై శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. సోమవారం ఉన్నత విద్యశాఖ కార్యదర్శి వికాస్ రాజ్, ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఇంటర్ బోర్డు విభజనపై ఉన్నత విధ్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి గురువారమే అధికారులతో సమీక్ష నిర్వహించి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
No comments:
Post a Comment