లక్ష మందికి పైగా శివసత్తులు రాక...
భక్తుల భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు...
భక్తుల భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు...
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు...
తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్:
బల్కంపేట అమ్మవారి కళ్యాణోత్సవాన్ని పుష్పమి నక్షంత్ర యుక్త శుభలగ్నం
మంగళవారం (నేడు) ఉదయం 11 గంటలకు భారీ కళ్యాణ మండపంలో వేదపండితుల
మంత్రోత్సవాల మద్య అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ
కర్యనిర్వహనాధికారి కె.రఘునందన రావు తెలిపారు. కళ్యాణ మహోత్సవాన్ని
తిలకించేందుకు తెలంగాణా జిల్లాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి లక్ష
మందికి పైగా అమ్మవారికి ప్రీతిపాత్రులైన శివసత్తులు, 5 లక్షల మందికి పైగా
భక్తులు రానున్నారని ఈవో తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా
కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో అన్నారు.శివసత్తుల నృత్యాలతో
బల్కంపేట పుర వీధుల గుండా కోలాటాలతో, భాజబజంత్రీల మద్య భారి ఊరేగింపును
నిర్వహిస్తామన్నారు.
విద్యుత్ కాంతుల మద్య ముస్తాబైన ఆలయం
No comments:
Post a Comment