విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, రఘునందన్, శేషుకుమారి
ప్రతి ఏటా జరిగే బల్కంపేట శ్రీ ఎల్లమ్మఅమ్మవారి కల్యనోత్సవాన్ని పటిష్టంగా నిర్వహించేందుకు ఎల్లమ్మ ఆలయంలో విలేకరుల సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బంది చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందిని కోరారు. నేటి నుంచి జరిగే అమ్మవారి కల్యనోత్సవాన్ని భక్తులకు కను విందులుగా నిర్వహిస్తామని ఆలయ కర్యనిర్వాహన అధికారి రఘునందన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బల్కంపేట కార్పొరేటర్ ఎం.శేషుకుమారి, బుట్టి రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయం బయట పోలీస్ సిబ్బందితో మాట్లాడుతున్నఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
No comments:
Post a Comment