All meadia

 

Wednesday, 11 June 2014

Fwd:






అభివృద్ధిని ప్రజా ఉద్యమంగా మారుద్దాం: మోడీ



ఢిల్లీ: స్వాతంత్య్ర ఉద్యమాన్ని మహాత్మాగాంధీ ప్రజల ఉద్యమంగా మలిచారని, ఆయన స్ఫూర్తితో ఇప్పుడు అభివృద్ధిని ప్రజల ఉద్యమంగా మారుద్దామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. లోక్‌సభలో ప్రసంగిస్తున్న ఆయన స్వాతంత్య్ర పోరాటం నాడు మనం పుట్టనందున అందులో పాల్గొనలేకపోయామని, నేడు దేశసేవకోసం జరిగే మరో ప్రజా ఉద్యమంలో అందరం పాల్గొందామన్నారు. మరో ఐదేళ్లలో మహాత్మాగాంధీ 150వ జయంతి జరుపుకోబోతున్నామని, నిష్కళంక భారత్‌ను నిర్మించి మహాత్ముడికి బహుమతిగా ఇద్దామని ప్రధాని పిలుపునిచ్చారు. 2022 నాటికి ప్రతి కుటుంబానికి సొంతింటి కల నెరవేరుద్దామన్నారు

No comments:

Post a Comment