All meadia

 

Wednesday, 9 December 2015

Fwd: Mission bhagiratha


---------- Forwarded message ----------
From: Sekhar Bargela <bargelasekhar@gmail.com>
Date: 2015-12-09 18:28 GMT+05:30
Subject: Mission bhagiratha
To: sekhar bargela <bargelasekhar@gmail.com>


పత్రికా ప్రకటన               09-12-15
 మిషన్ భగీరథతోనే తెలంగాణ తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం
 కోట్లాదిమంది దూప తీర్చడమే లక్ష్యంగా పనులు సాగాలి
 రైల్వే, అటవీ అనుమతుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు
 ఏప్రిల్ 30 నాటికి 9 నియోజకవర్గాల్లో ఇంటింటికి తాగునీరు
 పైప్ లైన్ పనులతో పాటు ఇంట్రావిలేజ్ పనులు వేగంగా సాగాలి
 మిషన్ భగీరథ, కరువు పై RWS&S ఉన్నతాధికారులతో స్పెషల్ సిఎస్ ఎస్పీ సింగ్ సమీక్ష
          కాలంతో సంబంధం లేకుండా తెలంగాణ ఎదుర్కునే తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి మిషన్ భగీరథే శరణ్యమని పంచాయితీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అన్నారు..ప్రపంచంలో ఎవరూ కనీసం ఊహించని విధంగా కోట్లాదిమంది దూప తీర్చడానికి సిఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేస్తున్నారన్నారు..ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా మిషన్ భగీరథ ప్రాజెక్టు ఉన్నతాధికారులు,ఇంజనీర్లు కష్టపడి పనిచేయాలని కోరారు..మిషన్ భగీరథ, కరువు పై RWS&S కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో ఎస్పీ సింగ్ సమీక్షా సమావేశం నిర్వహించారు..వర్షాభావంతో వచ్చే వేసవిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండే అవకాశం ఉందని.. దాన్ని ఎదుర్కునేందుకు ఇప్పటి నుంచే పటిష్ట ప్రణాళికలు తయారుచేయాలన్నారు..HMSSB పరిధిలోని 9 నియోజవకవర్గాలకు ఏప్రిల్ 30 నాటికి తాగునీటిని అందించే విధంగా మిషన్ భగీరథ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు... ఇక నుంచి తాను క్షేత్ర స్థాయి పర్యటనలు జరిపి పనులను పరిశీలిస్తానన్న ఎస్పీ సింగ్..పైప్ లైన్ పనులు చేస్తూనే ఇంట్రా విలేజ్ వర్క్ పూర్తిచేయాలని సూచించారు.. మిషన్ భగీరథ గురించి తెలుసుకునేందుకు నీతి అయోగ్ ఆసక్తి చూపుతోందని, ప్రాజెక్టు వివరాలతో సమగ్ర నివేదిక పంపాలని అధికారులను కోరారు..ఓ వైపు మిషన్ భగీరథ పనులు కొనసాగిస్తూనే మరోవైపు ఇప్పటికే కొనసాగుతున్న తాగునీటి సరాఫరా పథకాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు..పైప్ లైన్ పనుల కోసం అటవీ శాఖ సంపూర్ణ సహకారం అందిస్తుందని..ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదన్నారు..ఆ శాఖ అధికారులతో తాను ప్రతీరోజు మాట్లాడుతున్నానని చెప్పారు..సర్వే పూర్తి చేసి సమగ్ర నివేదిక ఇస్తే వన్యప్రాణి అభయారణ్యాల్లోనూ పనులకు ఇబ్బందులు రావన్నారు..అటవీ శాఖ కు పరిహారంగా ఇచ్చే భూముల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు..ఇక రైల్వే క్రాసింగ్ ల దగ్గర ఆ శాఖ అధికారులు చెప్పినట్టు పనులు చేయాలని ఎస్పీ సింగ్ సూచించారు..ట్రాన్స్ కో ఇంజనీర్లతో సమన్వయ సమావేశాలు ఏర్పాటుచేసి పనులు తొందరగా అయ్యేలా చూడాలన్నారు..WTP, OHBR తో పాటు మిషన్ భగీరథ కు చెందిన ప్రతీ డిజైన్ ను త్వరగా ఆమోదించి వర్క్ ఏజెన్సీలకు ఇవ్వాలని అధికారులకు చెప్పారు..జిల్లా ఎస్.ఈ లు అప్రూవ్ చేసి ఇచ్చే డిజైన్ లను త్వరగా పరిశీలించి ఇవ్వాలని వాప్కోస్ ప్రతినిధులను ఆదేశించారు.. ఈ సమీక్షా సమావేశంలో RWS&S ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, RWS&S ఈ.ఎన్.సి బి. సురేందర్ రెడ్డి, మిషన్ భగీరథ ప్రాజెక్టు సిఈ సురేష్ కుమార్,SE నందరావు, RWS&S కన్సల్టెంట్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు..


No comments:

Post a Comment