All meadia

 

Sunday, 25 May 2014

టి.కాంగ్రెస్ నేతలపై అమ్మాకొడుకుల ఆగ్రహం.. జరిగిందంతా మీవల్లే!!

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఫలితం లేకపోయిందని, ఇందుకు మీరే కారణమని టి. కాంగ్రెస్ నేతలపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మండిపడ్డారు.

తెలంగాణ నేతలతో సమావేశమైన సోనియా, రాహుల్ గాంధీలు ఎన్నికల సమయంలో సమర్థవంతమైన పీసీసీ నేత లేకపోవడం వల్లే పార్టీ ఓటమికి కారణమని టి. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన వివరణను కొట్టిపారేసారు.

అంతకుముందు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో టి.కాంగ్రెస్ నేతలు భేటీ ఆయ్యారు. పార్టీ ఓటమికి గల కారణాలపై ఒక నివేదికను అందజేశారు. ఆ నివేదికలో ఏముందో చదవకుండానే రాహుల్ ఆ నివేదికను విసిరిపారేశారు.

తెలంగాణ ఇస్తే అంతా సరిపోతుందన్నారు. కేంద్రంలో మోడీ హవా ఉన్నప్పటికీ, తెలంగాణ ఇస్తే ఏవీ పనిచేయవని చెప్పారు.

No comments:

Post a Comment