All meadia

 

Thursday, 29 May 2014

5లక్షల మంది మధ్య చంద్రబాబు ప్రమాణం

తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు ఈసారి ప్రజల మద్య ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్దమవుతున్నారు.చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఐదు లక్షల మంది జన సమీకరణ చేయాలని టిడిపి భావిస్తున్నది.ఈ విషయమై చంద్రబాబు సమక్షంలో కృష్ణ,గుంటూరు జిల్లాల పార్టీ నేతలు ఏర్పాట్లపై సమీక్షించారు.కాగా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించాలని వారు నిర్ణయించారు.తొలి సంతకం రైతు రుణ మాఫీ పై చేయనున్న నేపద్యంలో ప్రధాని వస్తే దానికి మరింత విలువ పెరుగుతుందని భావిస్తున్నారు. మరి నరేంద్ర మోడీ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.గతంలో రెండుసార్లు ప్రమాణ స్వీకారం కూడా రాజ్ భవన్ లో నే జరిగింది.ఈసారి రాష్ట్ర విభజన నేపధ్యంలో జనం మధ్య చేస్తున్నారు.ఎన్.టి.ఆర్.మొదట ఈ సంప్రదాయం ఆరంభించారు. ఆ తర్వాత నేదురుమల్లి జనార్ధనరెడ్డి కూడా లాల్ బహదూర్ స్టేడియంలో చేశారు.తదుపరి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కూడా జనం మద్యనే అక్కడే ప్రమాణ స్వీకారం చేశారు.ఈసారి చంద్రబాబు నాయుడు గుంటూరు వద్ద రాజదాని వెలుపల ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

No comments:

Post a Comment