తేది-04-06-2015
పత్రికాప్రకటన
మంత్రి కె.తారక రామారావు ఆల్ ఇండియా రెడియో పత్ర్యేక ఇంటర్యూ ని అసక్తిగా విన్న తెలంగాణ
పంచాయితీరాజ్ మరియు ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు ఆల్ ఇండియా రెడియో పత్ర్యేక ఇంటర్యూ ని తెలంగాణ ప్రజలు కార్యకర్తలు అస్తకి విన్నారు. ఇన్ని రోజుల పాటు కేవలం టివిలకి , పత్రికలతో ప్రజలతో నిరంతరం మమేకమైన ఐటి మరియు పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు మెదటి సారిగా ఆల్ ఇండియా రెడియోకి పత్ర్యేక ఇంటర్యూ ద్వారా ప్రజలకి తమ శాఖ ద్వార జరుగుతున్న ప్రగతిని వివరించారు. ఇంటర్యూ కి సంబందించిన సమాచారం ముందుకుగానే మీడియా ద్వార తెలుసుకున్న టియార్ యస్ కార్యక్తరలు, గ్రామీణ ప్రజలు రెడియోలకి ఈ రోజు ఉదయం అతుక్కుపోయారు. ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గంలో పలు పంచాయితీల్లో రెడియోలను ముందు పెట్టుకోని మంత్రి ప్రసంగాన్ని విన్నారు. ముఖ్యంగా పట్టణంలో ఉన్న నేత కార్మికులు రెడియోలను చేతపట్టుకోవడం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్ నగరంలను రెయిన్ బో యంపంలో ఇంటర్యూని ప్రసారం చేయడంతో నగరంలో పలు చోట్ల నాయకులు కార్యకర్తలు గుంపులుగా పాత రెడియోల ముందకు పెట్టుకోని మరీ విన్నారు.
అల్ ఇండియా రెడియో ద్వారా తన అనుభవాలను పంచుకున్న మంత్రి ఈ రెడియో ద్వార ప్రజలను కలవడం సంతోషాన్ని ఇస్తుందని, భవిష్యత్తులో ఖచ్చితంగా రెడియోతో మాట్లాడతానని తెలియజేశారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు లక్ష్యంగా పనిచేసిన తమ పార్టీ తెలంగాణ అభివృదద్దిలోనూ ఉద్యమ స్పూర్తితో పనిచేస్తామని తెలిపారు. తన శాఖ ద్వార జరుగుతున్న పలు కార్యక్రమాల గురించి ఇంటర్యూలో కూలంకషంగా మంత్రి వివరించారు. పంచాయితీల బలోపేతం, గ్రామాల సమగ్రాభివృద్ది లక్ష్యంగా తీసుకున్న రోడ్ల నిర్మాణం, వాటర్ గ్రిడ్ వంటి అనేక అంశాలపై మంత్రి తన మనోభావాలను పంచుకున్నారు. ఐటి శాఖ ద్వారా గత ఏడాదికాలంగా సాధించిన పెట్టుబడులు,రాబోయే కాలానికి నిర్ధేశించుకున్న లక్ష్యాలను వివరించారు. తెలంగాణ యువతకి, విద్యార్దులకి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకుసాగుతామని తెలిపారు. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో తాను పర్యటిస్తున్నప్పుడు హైదరాబాద్ నగరం గురించి అలోచిస్తుంటానని, కాస్మోపాలిటన్ నగరంగా తీర్చే దిశగాప లు ప్రణాళికలున్నాయని మంత్రి తెలిపారు.
Thursday, 4 June 2015
Minister KTR
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment